మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

నల్గొండ : మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు త్రీవ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదం ఘటన వేములపల్లి మండలం సల్పనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఆస్వస్థకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడెం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు త్రీవ ఆందోళనకు గురువుతున్నారు.