మనస్థాపంతో కుటుంబంతో సహా వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: తాండూరు మండలం జినుగుర్తిలో విషాదం అలముకుంది. రాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నిప్పటించుకున్నాడు. తల్లి లక్ష్మి, చెల్లెలు బుజ్జమ్మతో పాటు రాజు మృతి చెందారు. కిరోసిన్‌ పోయగానే తమ్ముడు చింటు తప్పించుకున్నాడు.
భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని రాజు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. తాను జైలు కెళ్తే కుటుంబాన్ని చూసేవారుండరని రాజు మనస్తాపంతో ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.