మలేషియా మాస్టర్స్‌లో కశ్యప్‌ ఓటమి

ప్రీక్వార్టర్స్‌లో ఇండోనేషియా చేతిలో పరాజయం
కౌలాలంపూర్‌,జూలై7(జ‌నంసాక్షి): కౌలాలంపూర్‌ వేదికగా జరుగతున్న మలేషియా మాస్టర్స్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రీక్వార్టర్స్‌లో భారత్‌ స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ ఓడిపోయారు. ఫలితంగా టోర్నీ నుంచి నిష్కమ్రించారు. ప్రీక్వార్టర్స్‌లో ఇండోనేషియాకు చెందిన ఆంథోనీ సినిసుకా గింటింగ్‌తో తలపడిన కశ్యప్‌ 21`10, 21`15 తేడాతో ఓడిపోయాడు. దాదాపు 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. వరుసగా రెండో రౌండ్లలో పూర్తి ఆధిపత్యం కనబర్చారు సినిసుకా. దీంతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఒలింపిక్‌ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌? టోర్నీ క్వార్టర్గ్‌ªనైల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సింధు.. 21`12, 21`10తో జాంగ్‌ యీ(చైనా)పై విజయం సాధించింది.