మల్లారెడ్డిని సన్మానించిన ఎంపీపీ హరికృష్ణ

శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి :
అనునిత్యం హిందు ధర్మ పరిరక్షణ కోసం పరితపిస్తు, ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యాలతోపాటు, సామాజిక సేవలతో ప్రజలకు చేరువైన రొండా మల్లారెడ్డిని తమిళనాడు రాష్ట్రంలోని వేదిక్ కల్చర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. పూడూరు హరిహరనందన అయ్యప్ప దేవాలయ ధర్మకర్త గురుస్వామి రొండ మల్లారెడ్డిని శనివారం మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అద్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  హరికృష్ణ మాట్లాడుతూ ఒక ఆధ్యాత్మిక వేత్తగా, సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిత్యసేవ ప్రదాత  డాక్టర్ రొండ మల్లారెడ్డిని తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందించడం గర్వించదగ్గ విషయమన్నారు.  డాక్టరేట్ పురస్కారం అందించిన తమిళనాడు వేదిక్ కల్చర్ రీసెర్చ్ సెంటర్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. ఇలాటి అత్యుత్తమ పురస్కారాలను డాక్టర్ మల్లారెడ్డి మరెన్నో అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ హార్జ నాయక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area