మల్లారెడ్డి ని పరామర్శించిన జడ్పిటిసి చారులత రాథోడ్.

జనం సాక్షి ఉట్నూర్.

ఉట్నూర్ మండల కేంద్రంలోని పులాజి బాబా కళాశాల ప్రిన్సిపాల్ అన్నెడ మల్లారెడ్డి యొక్క తండ్రి గత ఐదు రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ జడ్పిటిసి చారులత శైలేందర్ రాథోడ్ దంపతులు బిర్సాయిపేట్ గ్రామానికి వెళ్లి మల్లారెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మనోధైర్యాన్నిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.