మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్

 80x55ea4మహబూబ్ నగర్: రవాణా, భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర రవాణా కార్మికులు ఇచ్చిన ధర్నా పిలుపులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ఆపరేటర్లు బంద్ నిర్వహిస్తున్నారు. తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురాకుండా నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం యథావిధిగా విధుల్లో పాల్గొంటుండటం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ప్రైవేట్ ఆపరేటర్లు బంద్ పాటిస్తుండటం వల్ల సరకు రవాణాకు ఆటంకం తలెత్తింది.