మహాత్మా గాంధీజీ పోరాటం ఆదర్శనీయం..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 02(జనంసాక్షి) అహింసా మార్గం ద్వారా పోరాడి స్వాతంత్య్ర సాధించిన మహాత్మాగాంధీ అందరికీ ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు అన్నారు.శనివారం హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో 153 గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలోసంపత్,శ్రీనివాస్,సంపత్ ఎల్లయ్య,కుమార్,రవితేజ,రేణుక,అన్నపూర్ణ,మహేష్,వీరస్వామి,రంజిత్,రమేష్,మహేష్,భూపతి,నారాయణ,కనకయ్య,వెంకటయ్య,రాజయ్య,వీరయ్య,రాజేష్,కుమార్,రమేష్,శ్రీనివాస్,వీరన్న,శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.