మహిళపై అత్యాచారం, దారుణ హత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం జరిపిన దుండగులు ఆమెను గొంతుకోపి దారుణంగా హత్యచేసి ఆమె వంటిపై ఉన్న నగలను అపహరించారు. బషీరాబాద్ మండలం మంతట్టిలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆ మహిళ గొంతుకోసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత ఆమె వంటిపై ఉన్న నగలను అపహరించారు. ఈ ఘటన మంతట్టిలో సంచలనం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగంతకుల కోసం గాలిస్తున్నారు.