మహిళ ఆత్మహత్య

దుండిగల్‌: సూరారం కట్టమైసమ్మ చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని షాపూర్‌నగర్‌లోని న్యూ లాల్‌ బహుదూర్‌ పురకు చెందిన వసంత (50) గా గుర్తించారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.