మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

రాయికోడ్ అక్టోబర్ 12జనం సాక్షి రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిమ్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ పుట్టిన రోజు వేడుకలు నివాసం వద్ద ఆయన సతీమణి గ్రామ సర్పంచ్ అయిన రాధిక మరియు గ్రామస్థులతో కలిసి కేకు కటింగ్ చేస్తూ ఘనంగా నిర్వహించారు. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మండల యూవకులు గ్రామస్థులు మెగా రక్తదానం శిబిరన్నీ రుదిరా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రక్తదానం చేశారు.. ఈ పుట్టిన రోజు వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఏ ప్రభాకర్ పాల్గొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత రక్తదానంలో ముందుండాలని, అన్ని ధానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. కులమతాలను చూడనిది రక్తదానం ఒక్కటేనన్నారు. అపోహలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారందరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా 35 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన బ్లడ్ బ్యాగ్ లను రుదిరా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ హిమాయత్ నగర్ కు తరలించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఉపసర్పంచ్ రాజశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వివిధ గ్రామాల సర్పంచులు ముఖ్య నాయకులు వివిధ పార్టీలకు అతీతంగా మండల నాయకులు యూవకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.