మానవ సేవయే-మాధవ సేవ అంటున్న సానికొమ్ము

బూర్గంపహాడ్ ,మే31(జనంసాక్షి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక లో శ్రామిక శక్తి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి ఆపదలో ఉన్న సోమయ్యకు రక్తదానం చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు. భద్రాచలంలో ఓ ప్రవైట్ హాస్పటల్లో  పాల్వంచ మండలం దంతెలబారు గ్రామానికి చెందిన కారుమంచి సోమయ్య అనే పేషంటు కు రక్త శాతం తక్కువ కావడంతో అత్యవసరంగా రక్తం ఎక్కించాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సానికొమ్ము శంకర్ రెడ్డి ఆపదలో ఉన్న ఆయనకు రక్తదానం చేసి చేశారు. కార్మిక నేతగా వారి పనుల్లో బిజీగా ఉంటున్నప్పటకి ఎవరికైనా రక్తం అత్యవసరం అయితే వారి దృష్టికి వచ్చినట్లైతే వారు ఎక్కడున్నా వెంటనే వెళ్లి ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడంలో శంకర్ రెడ్డి ముందుంటారని పలువురు అభినందించారు. ఇప్పటివరకు 19 సార్లు రక్తదానం చేయడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు.