మిత్రబృందం ఆధ్వర్యంలో బియ్యం అందజేత

బయ్యారం,సెప్టెంబర్28(జనంసాక్షి):
బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామంలో నిమ్మల వెంకన్న అనే నిరుపేద కుటుంబానికి చెందిన వారి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి  మూడు రోజుల క్రితం ఉదయం 9 గంటల సమయం  ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది. నిరాశ్రయులైన వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మంగళవారం బయ్యారం మిత్ర బృందం ఆధ్వర్యంలో  మణి జనరల్ హాస్పిటల్ యజమాని బచ్చలకూరి కర్ణాకర్ ఇల్లందు వారి సహకారంతో క్వింటా బియ్యం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు సంగేపొంగు శ్రీనుమాదిగ మాట్లాడుతూ.. బచ్చలకూరి కర్ణాకర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు తనవంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారని,అందులో భాగమే  ఇర్సులాపురంలో నిమ్మల వెంకన్న కుటుంబానికి క్వింటా బియ్యం అందించడం జరిగిందన్నారు. అంతేకాదు తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నూతన ఇంటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణి జనరల్ హాస్పిటల్ యజమాని బచ్చలకూరి కర్ణాకర్,లక్ష్మణ్, ఉదయ్,తేజ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోమవరపు రవి మాదిగ, మిత్ర బృందం సభ్యులు తుడుం రాజేష్, చల్లా గోవర్ధన్, కొమిరె జనార్ధన్, తెరాస నాయకుడు రేఖ ఉప్పలయ్య, సారయ్య, బయ్యా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.