మిత్రుడి జ్ఞాపకంగా అన్నదాన కార్యక్రమం

 

 

 

 

 

తిమ్మాపూర్, అక్టోబర్ 20 (జనం సాక్షి): చిన్ననాటి మిత్రుడు, నమస్తే తెలంగాణ మానకొండూర్ రీజినల్ ఇన్చార్జి దూసేటి మహేందర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో అతని స్నేహితులు భాషబత్తిని వెంకటరమణ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధుల ఆశ్రమంలో, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిత్రుని జ్ఞాపకంగా పలువురికి అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గురువు రామారావు, చిన్ననాటి మిత్రులు రమేష్, మహేష్ పాల్గొన్నారు.