మీరే మా..బలం – మీరే మా..బలగం

ప్రతిక్షణం… ప్రజాక్షేమం
సూర్యుడు ఉదయించక ముందే ప్రజా సేవకుడు
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 20
– జనహృదయ నేత రసమయన్నకు అడుగడుగునా జన నీరాజనం..

– శంకరపట్నం మండలంలో మంగళవారం తొలిపొద్దు పర్యటనలో ఎమ్మెల్యే డా.రసమయి గారి విస్తృత పర్యటన..
……………………………………..
మీరే మా..బలం-మీరే మా..బలగం అంటూ ఈరోజు శంకరపట్నం మండలంలో తొలిపొద్దు పర్యటనలో భాగంగా విస్తృతంగా పర్యటించిన జనహృదయ నేత, గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ గారికి అడుగడుగునా మంగళ హారతులతో, నుదుట తిలకం దిద్దుతూ ప్రజలు జన నీరాజనం పలికారు

సూర్యుడు సైతం ఉదయించక ముందే ప్రజాసేవకుడు రసమయి గారు గ్రామాలకు చేరుకొని ప్రజలను మేల్కొలుపుతూ తాడికల్, అంబాల్ పూర్, ఇప్పలపల్లి, కరీంపేట, మొలంగూర్, చింతలపల్లి, లింగాపూర్, మెట్ పల్లి, కన్నాపూర్, ముతారం, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, లబ్దిదారులకు కళ్యాణాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు

గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్ళి కళ్యాణాలక్ష్మి, సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేస్.చంద్రశేఖర్ రావు గారు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, స్వయంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని సత్వరమే పరిష్కరిస్తూ ముందుకు సాగారు

మొలంగూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పూదరి నర్సయ్య ఇటీవల గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల టీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కును ఇచ్చారు
ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జనగాం భిక్షపతికి దళితబంధు పథకం కింద మంజూరైన కారును రసమయి గారు పంపిణీ చేశారు అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో అకాల మరణం చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి తమ సానుభూతి తెలిపారు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రసమయి గారిని ఘనంగా సన్మానిస్తూ, తమ అభిమానాన్ని చాటుకున్నారు..