మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్

జనం సాక్షి, వంగూర్:

మండలంలోని మీసేవ కేంద్రాలను మండల తహసీల్దారు రాజు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనితీరును పరిశీలించి ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా మీసేవ కేంద్రానికి వచ్చిన వారితో ని మాట్లాడి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మీసేవ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తహసిల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేసుకోమని వారు సూచించారు.