ముగిసిన తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి : నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని తెదేపా ప్రభుత్వాన్ని కోరింది, అధినేత చంద్రబాబు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది, భేటీ వివరాలను పార్టీ నేత దాడి వీరభద్రరావు మీడియాకు వివరించారు. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర జనవరి 26 వరకు కొనసాగుతుందని చెప్పారు, నీలం తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని పార్టీ డిమాండ్‌ వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరారు. వలసల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన పేర్కొన్నారు.