మున్నూరుకాపు మండల అధ్యక్షులుగా నాగు శంకర్

నియామకం పత్రాన్ని అందజేసిన కోల ఉపేందర్ రావు

మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన నాగు శంకర్ ‌ను మున్నూరు కాపు మండల అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు యెలిమినేడు రమేష్ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు కోల ఉపేందర్ రావు మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగు శంకర్ మాట్లాడుతూ, మండలంలో మున్నూరు కాపు అభివృద్ధికి ‌కృషి చేస్తామని అన్నారు. మున్నూరు కాపులో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు పై చదువుల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల ప్రధాన కార్యదర్శి వేనే‌పల్లి వీరబాబు, ఉపాధ్యక్షులు ‌కాసర్ల కోటేశ్వరరావు, శాఖమూడి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఏనుగు నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వీరభద్రం, కోల ఆంజనేయులు, కుందూరు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.