*మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి 10,000/ ఆర్థిక సహాయం అందజేసిన

-ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి.ధర్మరాజు….
నాగర్ కర్నూల్ రూరల్:జులై 21(జనంసాక్షి)
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హరిజన వాడలో నివసిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు కొత్త.బాలయ్య పదిరోజుల క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగింది.గత రెండు సంవత్సరాల క్రితం కరోన విలయ తాండవం చేస్తున్న సమయంలో తమప్రాణాలను లెక్క చేయకుండా ప్రతి ఇంటికీ శానిటైజ్ చేసి ఎన్నో కుటుంబాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరి ప్రాణాలు కాపాడిన వ్యక్తి బాలయ్య అని.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,నిరుపేదల పెన్నిధి,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి.ధర్మరాజు మాట్లాడం జరిగింది.ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి ద్వారా కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగం కలిపిస్తాము అని తెలిపారు.బాలయ్య కుంటుంబానికి అండగా నిలిచి వారి 10,000/రూపాయలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా తెరాస నాయకులు కొత్త.గంగాధర్,హరిజన వాడ తెరాస నాయకులు పాల్గొన్నారు.