ముస్కు శేఖర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

ఎల్బీనగర్ (జనం  సాక్షి )  నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ముస్కు శేఖర్ రెడ్డి  గత గురువారం అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ   పరమపదించారు. ఈ విషయం తెలుసుకొన్న  ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్    ఉదయం సాయి నగర్ కాలనీలోని  వారి నివాసానికి వెళ్లి శేఖర్ రెడ్డి   భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంభ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు .