ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం.

బూర్గంపహాడ్ జులై19(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గత వారం రోజులుగా గోదావరి వరదల వల్ల ఇల్లు వాకిలి వదిల పునరావాస కేంద్రాలలో ఉండి గోదావరి వరద కొంతమేరకు తగ్గిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్నటువంటి బాధితులకు, గోదావరి వరదల్లో ముంపుకు గురై ఇబ్బంది పడుతున్న గ్రామస్థులకు మూడురోజులుగా స్థానిక జామ మసీద్ నందు పాల్వంచ, స్థానిక ముస్లిం సోదరులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.