మూడో రోజుకు చేరిన తెదేపా మహాపాదయాత్ర

ఏలూరు: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో విస్తరించి ఉన్న  కొల్లేరు పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరింది. తెదేపా ఎమ్మెల్యేలు కలువపూడి శివ, చింతమనేని ప్రభాకర్‌, జయమంగళ వెంకటరమణలు మొండుకోడు,  కోటేశ్వరదుర్గాపురం, తమ్మరగూడెం, చాటపర్రు గ్రామాలమీదుగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కొల్లేరులోని మత్స్యకారులు వెళ్లే తాటిదోనెపై తిరుగుతూ ప్రజలను ఆకట్టుకున్నారు.