మృతదేహాన్ని కూడా చూడనివ్వరా: అనిఫ్ కుటుంబ సభ్యులు

 వరంగల్: ఉగ్రవాది అనీఫ్ కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కు చేరుకున్నారు. లాయర్ తో కలిసి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అనీఫ్ కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. కనీసం మృతదేహాన్ని కూడా చూడనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మానవహక్కులను ఉల్లంఘించారని, ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.