మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని కొరటికల్ (కే) గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఆత్రం తెలంగ రావ్ మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున బాధలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు.బలరాంతో పాటు హీరాసింగ్ సర్పంచ్ ఆత్రం నగేష్ ఎంపీటీసీ ఆత్రం భీంరావ్ రాజేశ్వర్ లక్ష్మణ్ ధరమ్ సింగ్ తదితరులు ఉన్నారు