మృతి చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని కుమారి గ్రామానికి చెందిన కౌలు రైతు అలకంటి శ్రీనివాస్ అప్పుల బాధతో ఇటీవలే మనస్థాపానికి గురై మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.బలరాంతో పాటు డోకురు బోజన్న ఉమేష్ నాయిడిప్రశాంత్,భీముడు సుధీర్ రాజశేఖర్ మణికంఠ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.