మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

రుద్రంగి సెప్టెంబర్ 22 (జనం సాక్షి)
రుద్రంగి మండలకేంద్రంనికి చెందిన ధర్నా గంగమల్లయ్య అనే రైతు పంట చేనులో గొర్లను మేపుతున్న క్రమంలో పాము కాటుకు గురై వారం రోజుల క్రితం చనిపోవడంతో అతని కుటుంబన్నీ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ అది శ్రీనివాస్ పరామర్శించి,మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.గంగమల్లయ్య కొడుకు చదువులకై తనవంతు సహాయం అందిస్తాననని ఆయన అన్నారు.అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం 5000 రూపాయల నగదు అందజేశారు.ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు తర్రే మనోహర్,పల్లి గంగాధర్,గండి నారాయణ,తర్రె లింగం,సూర యాదయ్య,గంధం మనోజ్,అక్కినపెళ్లి శ్రీనివాస్,దయ్యాల శ్రీనివాస్,ఒద్యారపు రమేష్,సనుగుల గంగాధర్,అంగల మల్లేశం,బొల్లి దేవేందర్,తదితరులు పాల్గొన్నారు.