మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి):
మండలంలోని మేడపేల్లి గ్రామ ఎంపీటీసీ మాలోత్ అచ్చమ్మ మోహన్ గారి తాత అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా వారి మృతదేహానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. వీరి వెంట టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్, నర్సంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, నల్లవెల్లి మండల నాయకులు పురుషోత్తం సురేష్, వెంకన్న, నాగరాజు, సదయ్య, చింటూ, మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area