మృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం

జడ్పీ చైర్ పర్సన్ సునితమహేందర్ రెడ్డి.
వికారాబాద్ జూన్ 18(జనంసాక్షి)

మృతుని కుటుంబ సభ్యులకు జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మనోధైర్యం కల్పించారు.
మొమిన్ పెట్ మండల పరిధిలోని ఇజరా చిట్టెంపల్లి తండా కు చెందిన సభావత్ మోహన్ (ఆటో డ్రైవర్) గత సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.అందులో భాగంగా తండాకు వెళ్లి బాధిత కుటుంబాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి  పరామర్శించి ధైర్యం చెప్పారు.ప్రభుత్వ గురుకులాల్లో సీటు కల్పించి మృతుడి పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ కాశీ రామ్ నాయక్,కోటపల్లి మండల ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, మోత్కుపల్లి సర్పంచ్ పాండురంగారెడ్డి, నాయకులు శ్రీను నాయక్, సర్దార్ నాయక్, తదితరులు ఉన్నారు.