మృతుల కుటుంబాలకు ఎంపీపీ పరామర్శ…….

టేకుమట్ల.జులై21(జనంసాక్షి) మండలంలోని గరిమిళ్ళపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన దాసరి కొమురయ్య,దాసారపు మదనమ్మ,ల మృతుల కుటుంబాలను ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు .మృతుల మృతికి కారణాలు తెలుసుకొని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం తెలిపారు.మృతుల కుటుంబాలకు ఎల్లవేళలా అండదండగా ఉంటామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లబెల్లి రమ రవీందర్,ఆరెపల్లి సర్పంచ్ గజ్జి సుజాత రమేష్,వార్డు సభ్యుడు అన్నారెడ్డి, నాయకులు దాసరపు భాస్కర్,దాసరపు జితేందర్,తదితరులు పాల్గొన్నారు.