మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి , ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ..

వరంగల్ ఈస్ట్ ,జూలై 23 (జనం సాక్షి):

ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌కు శుక్రవారం రాత్రి వరంగల్ న‌గ‌రంలోని మండిబజార్ లో నేలమట్టమైన  ఇంటిని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రమేష్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. అనంతరం యంజియం ఆసుప‌త్రిలో ప్రమాదంలో మ‌ర‌ణించిన మృత‌దేహాల‌ను ప‌రిశీలించి, వారి కుటుంబాల‌ను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.
Attachments area