మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు ఎస్పీ

ములుగు,ఫిబ్రవరి11 (జనం సాక్షి);  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ అన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గిరిజన జాతరకు సుమారు కోటి నుంచి కోటి 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. జాతరకు తరలి వచ్చే భక్తుల వాహనాలు,

నాలుగు వేల ఆర్టీసీ బస్సులు పార్కింగ్‌ చేయడానికి పార్కింగ్‌ స్థలాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

జాతర సందర్భంగా సుమారు 10 వేల మంది పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌ సమస్య లేకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తామన్నారు. 382 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్‌ కెమెరాలు, 20 డిస్ల్పే ప్యానెళ్లను ఏర్పాటుచేశామని, వాటిని కమాండ్‌ కంట్రోల్‌కి అనుసంధానించామని తెలిపారు. తద్వారా ట్రాఫిక్‌, శాంతి భద్రతలను 24 గంటలు పర్యవేక్షిస్తాము. వాహనాలు నిలపడానికి మొత్తం 33 పార్కింగ్‌ స్థలాలు, 37 హోల్డింగ్‌ పాయింట్స్‌ సంసిద్ధంగా ఉన్నాయన్నారు. 50 ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రజా సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేశామని, జాతర విధులను నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి మాస్క్‌, శానిటైజర్‌తో కూడిన కిట్‌ ఇస్తామని వెల్లడిరచారు. జాతరకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలిని, తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.