మేడారం పనులు ఇంకా పూర్తి కాలేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):-
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా పనులు ఇంకా పూర్తవలేదని గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు ప్రభుత్వంతో గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదని, భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవాలనేదే అభిమతమని అన్నారు. పనుల్లో చాలాచోట్ల నాణ్యత లేదని, ప్రమాణాలు పరిశీలించాకే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని కోరుతున్నట్లు సీతక్క చెప్పారు.