మేము సైతం ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్. సుగుణాకర్ రాజు..

(జనం సాక్షి)జూలై 12:ఎమ్ ఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సంద్భంగా జనగామ జిల్లా కేంద్రంలో డాక్టర్ సుగుణాకర్ రాజు మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుంగ కౌశిక్ అద్యక్షతన జనగామ పట్టణంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రపరేషన్ అవుతున్న 100 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సంద్భంగా డాక్టర్. సుగుణాకర్ రాజు మాట్లాడుతూ ఎమ్ ఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి మన ప్రాంతంలో జన్మించడం ఇక్కడి విద్యార్థుల అదృష్టం, వారు ఎన్నో లక్షల మంది అభ్యర్థులకు ఉచిత విద్య అందించారు, వారి పుట్టినరజు నాడు జనగామ విద్యార్ధులందరికీ మేలు చేయాలని మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచిత మెటీరియల్ అందించామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మంగళంపల్లి రాజు, గన్ను కార్తిక్, మహ్మద్ అబ్బాస్, కొండ్ర ప్రవీణ్, ఆసర్ల సుభాష్, వెంపటి అజయ్, చిలుక అనూష, బానోతు రుద్ర మొ,, వారు పాల్గొన్నారు.