మైనారిటీ గురుకుల విద్యార్థులకు ఘనంగా సన్మానం

దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి  మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో అతి చిన్న వయసులో నలుగురు విద్యార్థులు ఖురాన్  పఠనం  చేసినందుకు గాను శనివారం రోజున దేవరకొండ ముస్లిం మత పెద్ద హాజీ మరియు ఇమామ్ జామ మసీద్ దేవరకొండ  మౌలానా ఫారూఖ్ అహ్మద్ రషాదీ  విద్యార్థులను షాలువలతో సత్కరించారు.ఖురాన్ పఠనం చేసిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్, చంద్రకళ అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో మౌలానా ఉమర్ ఖాన్, పాఠశాల గదితో ఉపాధ్యాయులు మహమ్మద్ మరియు కోఆర్డినేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.