మొక్కలు నాటిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు

వరంగల్ ఈస్ట్ ,జూలై 23 (జనం సాక్షి):
రాష్ట్ర మంత్రివర్యులు తన అద్భుతమైన మేధా శక్తితో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖంగా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కల్వకుంట్ల తారక రామా రావు  జన్మదినం  పురస్కరించుకుని వారికి అత్యంత ప్రీతి పాత్రమైన మొక్కలను నాటే కార్యక్రమం తూర్పు శాశన సభ్యులు నన్నపనేని నరేందర్  సూచన స్ఫూర్తితో శనివారం చేపట్టి నట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు అన్నారు.కే.టి.ఆర్ జన్మదిన సందర్బంగా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కల్లో దేవతా వృక్షాలైన మారేడు, నంది వర్ధనం, ఉసిరి లాంటి మొక్కలు ఇతర పూల మొక్కలు ఉన్నాయి.కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు చిట్టిమళ్ళ సురేష్, కటకం రాములు, బిట్ల శేఖర్, పప్పుల మంజుల, గంగిశెట్టి హరినాథ్ సామాజికవేత్త  డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్థానిక భక్తులు. దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area