మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.
తొర్రూరు.22 జూలై( జనంసాక్షి )
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి అన్నారు. రైతు బంధు సమితి అధ్యక్షులు దేవేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండలంలోని గోపాల గిరి గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు ఎనమాల రాకేష్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు బాల్ పెన్స్,అరటి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా పాఠశాల, గ్రామపంచాయతీ ససిబ్బంది, నాయకులు దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ధర్మారపు యాకుబ్, ఎంపీటీసీ ధర్మారపు కిరణ్,మండల అధికార ప్రతినిధి నాగయ్య, మండల నాయకులు చిట్టిమల్ల మహేష్,పెద్ద వెంకన్న, ధర్మారపు మహేష్ ,యనమల శ్రీధర్, గుడెల్లి శేఖర్, హరిక్రిష్ణ,స్వరూప, సుధాకర్, అనంతరెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్, మహేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Attachments area