మోదీ ప్రభుత్వం పై యువత తిరుగుబాటుకు సిద్ధం కావాలి….

AISF రాష్ట్ర అధ్యక్షులు డా. వలీ ఉల్లా ఖాద్రీ…
మోదీ ప్రభుత్వం పై యువత తిరుగుబాటుకు సిద్ధం కావాలని డా. వలీ ఉల్లా ఖాద్రీ యువతకు పిలపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య AIYF హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నాడు బాలసముద్రం లోని జిల్లా కార్యాలయంలో నాయకులు భరత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి AIYF రాష్ట్ర అధ్యక్షులు డా. వలీ వలీ ఖాద్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి యువత వుతిరేఖ విధానాలకు పాల్పడుతుందని దానిలో భాగంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఎనిమిది సంత్సరాలు గడుస్తున్నపటికి ఆ హామీలో తుంగలో తొక్కారని దానికి ఉదాహరణే ఈ అగ్నిపత్ అని ఆయన విమర్శించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాద విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ దేశ లౌఖిక వాదాన్ని నీరుగారుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అదేకాకుండా మోదీ అధికారం లోకి వచ్చిన తరువాత దళితులపై, ఆదివాసులు, మైనారిటలపై దాడులు పెరగాయని అన్నారు. తినే వస్తువులపై కూడా GST పెట్టడం దుర్మార్గ చర్య అని వీటిని వెంటనే వెనుకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై యువత మరో తిరుగుబాటుకు సిద్ధం కావాలని ఆయన పిుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ AIYF నాయకులు గిన్నరపు రోహిత్, నాయకులు రమేష్, క్రాంతి, రాకేష్, పార్థు మరియు బన్ని తదితరులు పాల్గన్నారు.
Attachments area