మ.12 గంటలకు ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు

మహబూబ్‌నగర్ : సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. స్వస్థలమైన జడ్చర్లలో సిద్ధయ్య అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి హాజరు కానున్నారు.