యోగా శిక్షణ గురువుల దరఖాస్తులకు ఆహ్వానం

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి): సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా నందు సింగరేనియులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత యోగా శిక్షణ ఇవ్వటానికి తగిన అర్హత, ఆసక్తి గల యోగా గురువులు దరఖాస్తు చేసుకోవాలని డిజిఎం (పర్సనల్) అధికార ప్రతినిధి ఎస్ రమేశ్ తెలిపారు.పూర్తి వివరాలతో కూడిన తమ దరఖాస్తులను జిఎం కార్యాలయంలోని పర్సనల్ విభాగం నందు ది:30.07.2022లోపు అందచేయాలని తెలిపారు