రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

 రంగారెడ్డి: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం యాద్గారిపల్లెలోని జైభారత్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘటనలో రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. టింబర్ డిపోలో 20 నుంచి 30 లక్షల విలువైన కలప ఉన్నట్లు తెలుస్తోంది.