రంగారెడ్డి : దోపిడీ ముఠాను పట్టించిన స్థానికులు

హయత్‌నగర్‌, ఆగస్టు 21 : హయత్‌నగర్‌ మండలం కొత్తగూడెం దగ్గర స్థానికులు నలుగురు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో దొంగ పరారీలో ఉన్నాడు. దొంగల నుంచి కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు రాత్రివేళ జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు.