రజక సంఘాల సమితి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా దిగంబర్

ఝరాసంగం సెప్టెంబర్ 18 (జనం సాక్షి ) జిల్లా రజక సంఘాల సమితి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా దిగంబర్ ను నియమించడం జరిగింది. ఆదివారం తెలంగాణ రజక సంఘాల సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నామాల నాగేష్. వర్కింగ్ ప్రసిడెంట్ ఆగమయ్య జిల్లా నాయకులు పెట్లూరి రాజు శ్రీ కేతాకీ సంగమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అనంతరం కొల్లూరు గ్రామానికి చెందిన దిగంబర్ సూర్య ను సంగారెడ్డి జిల్లా రజక సంఘాల సమితి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో .నాయకులు శివకుమార్ నరేష్ రాజు శంకర్ నర్సింలు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.