రాజకీయ కక్షతోనే ఈడీ టార్గెట్‌ చేస్తోంది……..

 

***నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు…….
టేకుమట్ల.జులై21(జనంసాక్షి)రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకులను ఈడి టార్గెట్  చేస్తుందని భూపాలపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు .గురువారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ,ఎన్ఫోర్స్మెంట్ (ఈడి)ల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ప్రధాని మోదీ ఈడి విచారణల పేరుతో సోనియా గాంధీ,రాహుల్ గాంధీలపై అక్రమంగా కేసులు బనాయించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలను  అర్పించిన గాంధీ కుటుంబ సభ్యులను ఈ రకంగా ఈడీ విచారణల పేరుతో వేధించడం సరికాదన్నారు.సోనియా, రాహుల్ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు మోదీ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.కేంద్రం తీరుని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నందుకే మోదీ కక్ష సాధింపు చేస్తున్నారని అన్నారు.దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి కాంగ్రెస్ సృష్టించిన జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండ శ్రీకాంత్ పాణి,జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, మాజీ సర్పంచ్లు పెరుమండ్ల లింగయ్య,రాజమొగిలి,మండల నాయకులు గుర్రపు దయాకర్,దాసారపు సదానందం,కిష్టయ్య, యువజన నాయకులు రెడ్డిరాజుల రాజు,వైనాల యశ్వంత్,పెరుమండ్ల క్రాంతి, కొలుాగఅరి అనిల్,మచ్చ ప్రభాకర్,రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area