రాజ్ భవన్ లో నిర్మల్ విద్యార్థికి అరుదైన గౌరవం

నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని  శనివారం   హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిలి సై రంగరాజన్  చేతులమీదుగా నిర్మల్ పట్టణానికి చెందిన గుమ్ముల అశోక్ కూతురు అద్విక ప్రశంసపత్రం  అందుకున్నారు.హైదరాబాద్ విముక్తి ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు, త్యాగాలు అంశంపై వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ని అన్ని విశ్వవిద్యాలయములోని విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం భాషలలో పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు  నగదు పారితోషకం తో పాటు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈపోటీలకు వివిద విశ్వవిద్యాలయంలనుండీ సుమారు మూడువందల మంది విద్యార్థులు హాజరుకాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రుద్రూర్ లో ఫుడ్ టెక్నాలజీ ఫైనల్ ఈయిర్ చదువు తున్న గుమ్ముల అద్విక ఎంపిక కావడంతో నగదు పారితోషకం తోపాటు ప్రశంసపత్రం అందుకున్నారు.ఈకార్యక్రమంలో వివిద విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఆచార్యులు ,విద్యార్థులు పాల్గొన్నారు.