రాష్ట్రం లో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి: హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 9( జనం సాక్షి).

రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బిజెపి పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ , మహబూబాబాద్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వద్దిరాజు రామచంద్ర రావు అన్నారు. మానుకోట జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత చేసిన వ్యాఖ్య లను వెంటనే వెనిక్కి తీసుకుని ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహబూబాబాద్ ఎంపీ కవిత తన స్థాయి మరిచి మాట్లాడడం విడ్డూరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేపూరి వెంకన్న,మేరెడ్డి సురేందర్,వెల్ది మల్లయ్య,చీకటి మహేష్,మదన్ లాల్, మోదిన్ నాయక్, రామ్మూర్తి,మోతిలాల్, ఆకుల శ్రీనివాస్,నవీన్ కుమార్, సంపత్,సందీప్, నాగరాజు,గోడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.