రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎరువుల కొరత

– కేంద్రం సంమృద్ధిగానే ఎరువులు అందించింది
– బీజేపీ ఎంపీ అర్వింద్‌
నిజామాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, రైతుల రాజ్యం అని గొప్పలు చెబుతున్న తెరాస ప్రభుత్వం.. సకాలంలో ఎరువులు అందించలేక పోతుందని బీజేపీ ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. జిల్లాలో ఏర్నడ్డ యూరియ కొరతపై గురువారం ఆయన మాట్లాడారు. ఎరువుల కొరత ముమ్మాటీకీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, రాష్టాన్రికి కావాల్సిన ఎరువులను కేంద్రం సమృద్ధిగానే పంపిదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువ ఇచ్చి నిల్వ చేసుకోమని చెప్పిందని, కేసీఆర్‌ కుటుంబానికి ప్రాజెక్లుల విూద ఉన్న శ్రద్ధ రైతుల విూద లేదని విమర్శించారు. కేంద్ర నిధులు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లిస్తున్నారని, అందుకే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌కే పరిమితం అయ్యారని, జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించలేదనే కక్ష్య సాధింపుతోనే ఎరువులు ఇవ్వడం లేదని ఎంపీ అర్వింద్‌ దుయ్యబట్టారు.