రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నిర్మల్ విద్యార్థులు ఎంపిక

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో మంగళవారం నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ పోటీలలో నిర్మల్  విజయ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.లాస్య పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని ఆపాఠశాల కరాస్పాండెంట్ నాగభూషణం తెలిపారు.
అలాగే నిర్మల్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సాఫ్ట్ బాల్ పోటీలలో విజయ ఉన్నత పాఠశాల విద్యార్థులు సహస్త్ర ,రామ్ చరణ్, సాయి చరణ్, ప్రణవేష్ పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక కావటం జరిగిందని, వీరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఈనెల 19వ తేదీన జరిగేటటువంటి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైనటువంటి విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ మంచిరాల నాగభూషణం , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి , పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గిరిప్రసాద్ ,కృష్ణవేణి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.