రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి స్నేహితులు సన్మానం

 

 

 

 

 

 

పాన్ గల్ సెప్టెంబర్ 03( జనం సాక్షి )
 మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
అదామ్ రాజు కు స్నేహితులు సన్మానం చేశారు. ఇటీవల నాస్తిక సమాజ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆదం రాజు నియామకం కావడం తో పాటు మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేయడాన్ని హర్షిస్తూ స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆదం రాజు మాట్లాడుతూ ప్రజల్లో మూఢనమ్మకాల నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని, ఇప్పటికే విస్తృత స్థాయిలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని, మూఢనమ్మకాలను రూపుమాపడానికి  ప్రజలను చైతన్యవంతులను చేయడమే తన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగేష్ సాగర్, వెంకటేష్ యాదవ్, వెంకటయ్య గౌడ్, శ్రీధర్ శెట్టి, వేణుయాదవ్, రాములు యాదవ్ పాల్గొన్నారు.