రెండు రాజ్యాలే తెలంగాణను ముంచినయి : కేసీఆర్‌

రంగారెడ్డి: రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం రెండూ తెలంగాణను నిలుపునా ముంచాయని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిందే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆయన విమర్శించారు. ఇవాళ ఆయన పరిగిలో పరిగి ఎమ్మెల్యే కొప్పల హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపనున్నారని అందుకు టీఆర్‌ఎస్‌ అంగీకరించిందని కేసీఆర్‌  తెలియజేశారు.