రెండు వైపుల నుంచీ తవ్వకాలు జరుపుతాం

` ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులకు ఆధునిక పరిజ్ఞానం వినియోగం
` ప్రాజెక్టు పూర్తిచేసి నల్గొండలో ఫ్లోరోసిస్‌ లేకుండా చేస్తామని ప్రకటన
` భారాస పాలన వల్లే టన్నెల్‌ ఆలస్యం
` ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని పూర్తిచేయడాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది:మంత్రి ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ఎస్‌ఎల్‌బీసీ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సచివాలయంలో సవిూక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ అంజద్‌ హుస్సేన్‌, ఇంజనీర్లతో మంత్రి సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని ఆదేశించారు. సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్‌ తవ్వకాలు జరపనున్నారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోవిూటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రో మాగ్నటిక్‌ సర్వే పూర్తయినట్టు అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్‌ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేయడాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఉత్తమ్‌ వివరించారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి 25శాతం అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు. భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలన వల్లే ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో ఆలస్యం జరిగిందన్న మంత్రి.. ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేయడమే కాకుండా, ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా లేకుండా చేస్తామని ప్రకటించారు.ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ అంజద్‌ హుస్సేన్‌, ఇంజనీర్లతో మంత్రి సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు.