రెండేళ్ల బాలుడి అపహరణ

నల్గొండ: నల్గొండ జిల్లా సాగర్‌ రోడ్డులో రెండేళ్ల బాలుడు వినయ్‌కుమార్‌ను దుండగులు అపహరించారు. వినయ్‌ ఆరుబయట ఆడుకుంటుండగా సుమో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సమాచారం.  వినయ్‌ తల్లిదండ్రులు ఈ మేరకు నల్గొండ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.